అనంతపురం : జిల్లాలోని తాడిపత్రి అల్ట్రాటెక్ ప్యాక్టరీ వద్ద బుధవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. విధుల నుండి 185 మంది కార్మికులను తొలగించటంపై నిరసన వ్యక్తం చేస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆద్వర్యంలో కార్మికులు ఫ్యాక్టరీని ముట్టడించేందుకు యత్నించారు. అయితే వారి ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.