అనంతపురం : ఓ ఘర్షణ కేసులో జైలులో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పడు కేసులు బనాయించి తమను వేధిస్తున్నారని వారు సునీతతో చెప్పారు. అక్రమంగా బనాయించిన కేసులపై పార్టీ తరుపున పోరాటం చేస్తామని నేతలకు ధైర్యం చెప్పారు.