లోయలో పడిన టూరిస్ట్ బస్
శ్రీశైలం : ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రం శ్రీశైలం వస్తున్న ఒక ప్రైవేటు టూరిస్టు బస్సు లోయలో పడిన దుర్ఘటనలో డ్రైవర్, మరో మహిళ అక్కడికక్కడే మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సున్నిపెంట ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 50 మంది ఉన్నారని సమాచారం. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరు నుంచి శ్రైశైలం వస్తున్న ఎపి 16 టిఎక్స్ 7566 నెంబర్ గల టూరిస్టు బస్సు శ్రీశైలం చెక్ పోస్టు సమీపంలోని ట్రైబల్ మ్యూజియం వద్ద ఘాట్ రోడ్డులో అదుపు తప్పి లోయలో పడిపోయింది.
News Posted: 4 February, 2010
|