కాకినాడ : స్థానిక లెనోరా ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిని నేమాని వర్థిని శిరీష సోమవారం ఆత్మహత్య చేసుకుంది. రామచంద్రాపురానికి చెందిన బీటెక్ కంప్యూటర్ సైన్స్ కోర్సు చదువుతోంది. అయితే కాలేజీకి వెళ్లిన శిరీష ఆరోగ్యం బాగాలేదంటూ క్లాసు మధ్యలోనే తిరిగి హాస్టల్ రూమ్ కి వచ్చింది. రూమ్ లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని శిరీష ఆత్మహత్య చేసుకున్నట్లు సహచర విద్యార్థులు గుర్తించి యాజమాన్యానికి సమాచారం అందించారు. పరీక్షలు బాగా రాయలేదన్న బెంగతోనే శిరీష ఈ చర్యకు ఒడిగట్టి ఉంటుందని పలువురు భావిస్తున్నారు.