విస్తృతంగా కూంబింగ్
కరీంనగర్ : జిల్లాలో పోలీసులు తనిఖీలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. మంగళవారం మొదలైన తనిఖీలు రెండో రోజు కూడా కొనసాగిస్తున్నారు. జిల్లాలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. జిల్లాలోని సారంగపూర్, మహాముత్తారం, మంధని, కథలాపూర్, కమాన్ పూర్ మండలాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
News Posted: 10 February, 2010
|