నెల్లూరు : నగర పాలక సంస్థ మేయర్ భానుశ్రీ నివాసంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆమె బంధువులు ఇంటిపై కూడా ఏకకాలంలో సోదాలు జరిపారు. మేయర్ భానుశ్రీ భారీ మొత్తంలో అవినీతికి పాల్పడినట్లు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆమె నివాసంపై దాడి జరగడం గమనార్హం. దాడులు ఇంకా కొనసాగుతుండటంతో వివరాలు వెల్లడించేందుకు ఏసీబీ అధికారులు నిరాకరించారు.