నిజామాబాద్ : పార్లమెంట్ సభ్యుడు మధుయాష్కీకి కాంగ్రెస్ అధిష్ఠానం షోకాజ్ నోటీసు జారీ చేయడాన్ని జీల్లా పార్టీ వర్గాలు తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ అంశంపై స్పష్టతతో ఉన్న నేతకు షోకాజ్ ఇవ్వడం ద్వారా ప్రజలకు తప్పుడు సంకేతాలు ఆందుతాయని పలువురు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఆంధ్రప్రాంతానికి చెందిన నేతలు కుట్ర ఫలితంగానే షోకాజ్ జారీ అయిందని నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు విమర్శించారు. ఆయితే ఎంపీకి బాసటగా పార్టీ వర్గాలు నిలవాలని నిర్ణయించాయి.