నిజామాబాద్ : ప్రత్యేక తెలంగాణ సాధనకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ తెలిపారు. వర్ని మండల జేఏసీ నాయకులు ఎంపీ కనిపించడం లేదని పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేయటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. తెలంగాణా ప్రాంతంలోని 11 మంది ఎంపీలు కలసి అధిష్ఠానాన్ని తెలంగాణకు అనుకూలంగా ఒప్పిస్తామని వివరించారు.