|
|
Articles: My Thoughts | పెంచితే ... తుంచలేం! - Site Administrator
| |
(దుగ్గరాజు శ్రీనివాసరావు)
పర్యావరణం పరిరక్షణలో కీలకపాత్ర వహించేది మొక్కలు. అయితే ఈ చెట్లను విచక్షణారహితంగా నరికివేయటాన్ని ఆపాలి, కొత్త మొక్కలు నాటాలి. ఇది ఒక నినాదంగా మొదలైంది. అయితే ఈ రెండు అంశాలు సజావుగా సాగుతున్నట్టు కనిపించడం లేదు.
మన రాష్ట్రంలో వున్న విద్యుత్తు కొరతను దృష్టిలో పెట్టుకుని పలు రకాల పవర్ ప్లాంటులకు అనుమతి ఇవ్వటం జరిగింది. వీటిలో విద్యుత్తును ఉత్పత్తి చేసి వాటిని తామే ఉపయోగించుకోవచ్చనే అనుమతి ఇచ్చారు. ప్రతి ఫ్యాక్టరీ తమకు అనుబంధంగా ఒక పవర్ ప్లాంట్ ని నిర్మించుకున్నారు. ఇందులో విద్యుత్ ఉత్పత్తికి బయోఫ్యూయల్ (జీవ ఇంధనం) వాడటం విశేషం. బయోఫ్యూయల్ అంటే వీరు ఉపయోగిస్తున్నది చెట్లనే. చెట్లను నరికి అది తగలపెట్టడం ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు. ఇందుకోసం సమీపగ్రామాలలోని చెట్లను యధేచ్చగా కొట్టేస్తున్నారు. గ్రామాలలో ఇళ్ళలో వున్న చెట్లకు వెలకట్టి కొనేస్తున్నారు. వేప, మామిడి వంటి చెట్లను డబ్బు ఆశచూపి చవకగా సొంతం చేసుకుని కొమ్మలుగా కొట్టి ఫ్యాక్టరీ చేరవేస్తున్నారు.
ఫ్యాక్టరీ ప్రాంగణంలో గుట్టలు గుట్టలుగా పేర్చిన చెట్ల కొమ్మలను ఇతరులకు కనిపించకుండా గడ్డితో కప్పివుంచుతున్నారు. చెట్లను యధేచ్ఛగా నరకటానికి వీలు లేదన్న చట్టాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం కళ్ళు మూసుకు కూర్చోవడంతో పచ్చని చెట్లు టపటపా రాలి పోతున్నాయి. పచ్చగా వున్న చెట్లను నరికేందుకు వీలులేదని, ఎక్కడైనా, ఎప్పుడైనా ఒక ఫారెస్టు అధికారి అభ్యంతరం పెడితే, ముందుగా ఆ చెట్టు మొదటిలో మంటపెట్టో, మరొకటి చేసో వేర్లతో సహా మాడిపోయేలా చేసి ఆ తర్వాత వాటిని కొట్టి తెచ్చుకుంటున్నారు. చెట్లు పోతే వచ్చే ఇబ్బంది ఏమిటో, దాని వలన వచ్చే దీర్ఘకాల నష్టం ఏమిటో తెలియని గ్రామస్థుల అమాయకత్వాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి పారిశ్రామిక సంస్థలు.
మరోవైపు చెట్లు పెంచిన వారికి అవసరానికి కూడా వాటిని కొట్టేందుకు వీలులేని నిబంధనలు వేధిస్తున్నాయి. చెట్ల కొట్టివేత కర్నాటక, ఒరిస్సా వంటి రాష్ట్రాలు చాలాకాలం క్రితమే చట్టాలు చేశాయి.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|