|
|
Articles: Politics | ప్రజాస్వామ్యం అపహాస్యం! - Site Administrator
| |
చలసాని నరేంద్ర
ఇందిరాగాంధీ మనవడు, భాజపా అభ్యర్థి వరుణ్ గాంధీని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్ చేసిన తీరు మన ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఉంది. తాము అధికారంలోకి రాగానే తిరిగి పోటా చట్టం తీసుకువస్తామని పదేపదే చెబుతున్న భాజపా నాయకత్వానికి ఈ అరెస్టు కనువిప్పు కలగించాలి. ఇటువంటి చట్టాలు ఏ విధంగా రాజకీయ ప్రత్యర్థులపై ఉపయోగించి దుర్వినియోగం చేయవచ్చో ఈ ఉదంతం వెల్లడి చేస్తుంది. గతంలో పోటా కూడా తీవ్రవాదులపై కన్నా రాజకీయ ప్రత్యర్థులపై, ప్రజల నిరసనను అణచడానికీ ఎక్కువగా ఉపయోగించారని గుర్తించాలి.
వరుణ్ గాంధీ మతోద్రేకాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగించారని ఆరోపణ ఎదుర్కొంటున్నారు. ప్రజాజీవనంలో హుందాగా, నాగరికంగా వ్యవహరించాలి. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రాజకీయ ప్రత్యర్థులపై మన ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడైన మాజీ ముఖ్యమంత్రి ఉపయోగించిన చౌకబారు పదజాలాన్ని ఇంకెవ్వరూ ఉపయోగించి వుండరు.
వరుణ్ గాంధీ చేసినట్లు చెబుతున్న ఆ ప్రసంగాన్ని కొన్ని వందల మంది ప్రజల ముందు చేసి వుంటారు. కాని నేడు టి.వి.ఛానళ్ళ ద్వారా కోట్లమంది ప్రజలకు ఆ ప్రసంగాన్ని వినిపించడం ద్వారా సాధించిన ప్రయోజనం కనిపించదు. పైగా, రెండు మూడు వారాల తర్వాత ఆ ప్రసంగాన్ని టి.వి.లో వినిపించడం గమనిస్తే, దీని వెనుక రాజకీయ దురుద్దేశాలే కనిపిస్తాయి.
తను ఆ విధంగా ప్రసంగించలేదని వరుమ్ గాంధీ చెప్పారు. ఆ సిడిలను పలు పర్యాయాలు ఎడిట్ చేసి ప్రసంగాన్ని వక్రంగా మార్చారని ఆరోపించారు. ఈ ఉదంతంపై క్రిమినల్ కేసు నమోదు చేయమని ఎన్నికల కమిషన్ ఆదేశించడం వరకు బాగానే వుంది. కానీ వరుణ్ గాంధీని తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించవద్దని భాజపాకి ఎన్నికల కమిషన్ సూచించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|