|
|
Articles: My Thoughts | మనది మహా తెలంగాణ - Site Administrator
| |
- విజయ్
భారతావనిలో అతి ప్రాచీనమైన జాతులలో తెలుగుజాతి ఒకటి. తెలుగువారికి మహోన్నతమైన చరిత్ర, సంస్కృతి ఉంది. క్రీస్తుశకం 230 సంవత్సరంలోనే ఆంధ్ర శాతవాహనులు తమ సామ్రాజ్యాన్ని నెలకొల్పినారు. వారి సామ్రాజ్యం ఉత్తరాన గుజరాత్, వింధ్య పర్వతాల వరకు, కోస్తాజిల్లాలకూ విస్తరించి ఆనాడే తెలుగువారుగా మనకు గుర్తింపు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు నాలుగు దశలలో తెలుగు వారమంతా ఒకే గొడుగు క్రింద కలిసి బ్రతికాం. ఒకటి ఆంధ్ర శాతవాహనుల కాలంలో, రెండవది కాకతీయల కాలంలో, మూడవది విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయుల కాలంలో, నాలుగవది నిజాం ప్రభువు కాలంలో.
తెలుగు భూభాగం ఒక్కో దశలో ఒక్కొక్క విధంగా మార్పులకు గురయింది. 15వ శతాబ్దం తొలిదశలో కోస్తా జిల్లాలే అధికభాగం తెలంగాణా అని పిలువబడ్డాయంటే ఆశ్చర్యపడతాం. నిజాం ప్రభువు 19వ శతాబ్దంలో తొలుత నెల్లూరు తప్ప మిగిలిన సర్కారు జిల్లాలను బ్రిటీషువారికి అప్పజెప్పాడు. ఆ తర్వాత నాలుగు రాయలసీమ జిల్లాలను (బళ్ళారి, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలను) అప్పజెప్పాడు. ఆనాడు నెల్లూరుజిల్లా కర్నాటక నవాబు పాలనలో వుండేది. చిత్తూరు జిల్లా 20వ శతాబ్దం తొలి దశాబ్దంలో కడప జిల్లాలోని మదనపల్లి రెవెన్యూ డివిజన్, చెగల్పట్టు జిల్లాలోని కొంతభాగం, నార్త్ ఆర్కాట్ జిల్లాలోని కొంత భాగం కలిపి ఏర్పాటు చేశారు. భాషాప్రయుక్త రాష్ట్రాలు అమలులోకి వచ్చినప్పుడు పటాస్కర్ ఫార్ములా పాటించి అనంతపురం జిల్లా, బళ్లారి జిల్లాలమధ్య కొన్ని గ్రామాల్లో కన్నడ భాష మాట్లాడేవారే ఎక్కువగా వున్నారనే కారణం చూపి బళ్లారి జిల్లాలను కర్నాటక రాష్ట్రంలో కలిపారు. అదే కారణంతో మనం కోలారు తాలూకా కోల్పోయాం. ఇటుకృష్ణగిరి వంటి ప్రాంతాలను తమిళనాడుకూ, అటు ఉత్తరాన గంజాం, కోరాపుట్ జిల్లాలను ఒరిస్సాకూ కోల్పోయాం. దక్షిణ బస్తర్, చందా వంటి ప్రాంతాలనూ కోల్పోయాం.
| Read 4 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|