|
|
Articles: My Thoughts | అబ్బూరి వారి చాటువులు - Site Administrator
| |
Miss rajeswari rajeswarinedunuri
నిఖిల జగముల దృశ్యుడై నిండియున్న
ఈశ్వరుని ప్రకృతియే స్పురియింప జేయ
మనమున కతీతమయిన వర్ణనల గూడి
ప్రకృతి పరమాత్మ యనెడి విభ్రమము గొలువు.
'ప్రకృతియే పరమాత్మ, పరమాత్మయే ప్రకృతీ' అని చెప్పడానికి 'జలాంజలి' అనే కావ్యం రాసారట. ఈయన భావ కవితా ఉద్యమ రధ సారధుల్లో ఒకరు. ఎన్నో కధలు, కావ్యాలు, వ్యాసాలు, నాటకాలు రాసినా చాటు కవిత్వంలో అగ్ర గణ్యులు. అబ్బూరి రామకృష్ణా రావు గారు 1896 లో మే 20న గుంటూరు జిల్లా తెనాలి తాలూక అనంతవరం లో జన్మించారు. వీరి తండ్రి లక్ష్మీనారాయణ శాస్త్రి గారు. సంస్కృతాంధ్ర భాషల్లో మంచి పండితులు. తండ్రి గారి ప్రభావం అబ్బూరి వారిపైన చాల ఉందని చెప్పుకోవచ్చును.
ఇక అబ్బూరి వారు ముందు భావ కవిగా ప్రారంభించి, కమ్యూనిష్టుగా, కాంగ్రెస్ వాదిగా, రాడికల్ మానవతా వాదిగా ఎదిగారు. ఆయన పట్టని ప్రక్రియ లేదు. ఐదొవ ఫారం వరకు తెనాలిలో చదివి సికింద్రాబాదులో మెట్రిక్యులేషను, బందరు నోబులు కళాశాలలో ఎఫ్.ఎ చదివారు. పిమ్మట మూడేళ్ళు మైసూరు సంస్కృత పాఠశాలలో చదివారు. తదుపరి కలకత్తా వెళ్ళి రవీంద్రుని సన్నిధి లో గడిపి, బెంగాలీ, ఆంగ్ల నాటకాలు విరివిగా చూశారు. తదుపరి 1919 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం అనువాద శాఖలో జేరి అనేక విధులు నిర్వర్తిస్తూ, 1959 లో ఆంధ్ర విశ్వకళా పరిషత్తు చీఫ్ లైబ్రరేరియన్ గా పదవీ విరమణ చేశారు. ఐతే ఇక వారి చాటువుల గురించి...
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|