|
|
Articles: Recipes | నువ్వుండ పూర్ణాలు - Site Administrator
| |
(రత్నం.కె)
కావలసిన పదార్థాలు :
నువ్వులు - 1/2 కిలో
కొబ్బరి కోరు - 1 కప్పు
బెల్లం - 1/4 కిలో
రిఫైండ్ ఆయిల్ తగినంత
యాలకుల పొడి - 5 గ్రాములు
మైదా - 400 గ్రాములు
కార్న్ ఫ్లోర్ - 50 గ్రాములు
బియ్యంప్పిండి 50 గ్రాములు
ఉప్పు - చిటికెడు
తయారుచేయు విధానం : శుభ్రం చేసుకొన్న నువ్వులను దోరగా వేయించుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా చేసుకోవాలి. జార్ లో కొద్దిగా నువ్వు పిండి ఉంచి దానిలో బెల్లం చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దానిని కూడా మిక్సీ వేసి మరొక్క సారి మెత్తగా వేసుకోవాలి. దీనిలో కొబ్బరి కోరును, యాలకుల పొడిని కలపాలి. తర్వాత ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పూతపిండి కోసం మైదా, కార్న్ ఫ్లోర్, బియ్యంపిండి, చిటికెడు ఉప్పు, కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసి చిక్కగా గుజ్జులా కలిపి పూతపిండిలా చేయాలి. ఈ పిండిని పది నిమిషాలు నాననివ్వాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాణలీ పెట్టి తగినంత నూనె పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత చిన్న చిన్న నువ్వుండలను పూతపిండిలో ముంచి అందులో వేయించి తీయాలి. అంతే నువ్వుండల పూర్ణాలు రెడీ.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|