|
|
Articles: Devotion | ధన్యజీవి - Site Administrator
| |
(చిల్లరమబ్బు శివకుమార్)
అనాచారము అసహ్యకరమైనది. అతిగా ఆచారము మూఢమైనది. విచారముతో ఆచారము కలిసినపుడే సదాచారము. అటువంటి సదాచారాన్నే శ్రీ సాయిబాబా సులభ సాధ్యమయిన భక్తి మార్గంలో బోధించారు.
మానవ జీవితము క్షణ భంగురము. అనంత కాల ప్రవాహంలో మానవుని జీవిత కాలము పరమాణువులో వెయ్యోవంతు. అలాంటి జీవితాన్ని సర్వసస్వంగా భావిస్తూ, చిరకాలమూ జీవిస్తానని తలంచుతూ, స్వార్థంతో ఇతరుల్ని మోసగించి, పీడించి ధనార్జన చేసి చివరికి తామేమియూ అనుభవించకనే మరణిస్తూంటాడు సగటు మానవుడు. మరణము ప్రతి జీవికీ తథ్యము. మృత్యువు పండితునికీ, మూర్ఖునికీ, బలవంతుడికీ, దుర్భలుడికీ, ధనవంతుడికీ, దరిద్రుడికీ అందరికీ సమానము. కాబట్టి మృత్యువు తథ్యమని గ్రహించి ఎన్నో జన్మల పుణ్య ఫలాన్ని ధారపోసి సంపాదించిన మానవ జన్మను భక్తి మార్గంతో నిరంతర సాయినామ సంకీర్తనలతో, సజ్జన సాంగత్యంతో, పరోపకార దృష్టితో సాధు సంతులను గౌరవిస్తూ దైవచింతనతో కాలం గడపి జన్మను సార్థకం చేసుకోవాలి.
అన్ని ఆశ్రమధర్మాల్లో శ్రేష్టమయినది గృహస్తాశ్రమ ధర్మము. ఎందువల్లననగా గృహస్తు అందరికీ ఆధారభూతమయినవాడు, సాధుపుంగవులకు బిక్షనొసగి ఆదరించేవాడు గృహస్తే, తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఐదుగురిని పోషించేదీ గృహస్తే. నదులు ఎట్లైతే తమ నీటిని తామే త్రాగవో, వృక్షములు ఎట్లైతే తమ పండ్లను తామే భుజింపవో, మేఘాలు పైరు పంటలకోసం తాము కరిగి వర్షిస్తాయో అట్లా సత్పురుషుడైన గృహస్తే పరులకోసం తన ధనాన్ని వెచ్చిస్తాడు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|