|
|
Articles: Festivals | దసరా వైశిష్ట్యం - Site Administrator
| |
త్రిమూర్తులయిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, అష్టదిక్పాలకులు, సూర్యచంద్రులతో సహా సకల దేవతులు అర్చించే దేవత ఆ జగజ్జనని మాత్రమే. అమ్మ అండదండలు లేక బ్రహ్మ సృష్టి చేయలేడు. విష్ణువు సృష్టి సంరక్షణ శివుడు సృష్టి చేయలేడు. విష్ణువు సృష్టి సంరక్షణ శివుడు సృష్టి విలయం చేయలేడు. దేవీభాగవతం ప్రకారం వసంతఋతువులో వచ్చే చైత్రమాస ప్రారంభమున కానీ, శరదృతువులో వచ్చే ఆశ్వయుజ మాసంలో జరుపుకొను నవరాత్రులను శరన్నవరాత్రులని, చైత్రమాసంలో జరుపుకొను నవరాత్రులను వసంత రాత్రులని అంటారు. ఈ రోజులలో అమ్మవారిని ధ్యానించి ఏదైనా పని తలపెడితే, ఆ పని దిగ్విజయంగా పూర్తి అవుతుంది. ఎవరైతే అమ్మవారిని అత్యంత భక్తితో పూజలుచేసి అమ్మవారి మహిమలు వింటారో వారు అన్ని రకాల బాధల నుండి విముక్తి పొంది ధనధాన్య సంపదలతో సుఖముగా ఉంటారు. కొన్ని ప్రాంతాలలో దసరాకు ఒక వేడుకగా బొమ్మల కొలువు పెట్టే ఆచారం ఉంది.
దుర్గాష్టమి
దుర్గాదేవి 'లోహుడు' అనే రాక్షసుని వధిస్తే లోహం పుట్టిందని, అందువల్ల లోహపరికరాలని పూజించే ఆనవాయతి వచ్చింది అని చెప్తారు. ఇక దుర్గ అంటే? దుర్గమైనది దుర్గ. దుర్గతులను తొలగించేది దుర్గ. ఈమె దుర్గేయురాలు కనుక దుర్గ అయింది. 'దుర్గలోని 'దుర్' అంటే దుఃఖం, దుర్భిక్షం, దుర్వ్యసనం, దారిద్ర్యం మొదలైనవి. 'గ' అంటే నశింపచేసేది' అని దైవజ్ఞులు వివరణ చెప్తూ ఉంటారు. ఈమె ఆరాధనవల్ల దుష్టశక్తులు, భూత, ప్రేత, పిశాచ, రక్కసుల బాధలు దరిచేరవు, చేరలేవు. అందువల్లనే మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తదుపరి మూడురోజులు లక్ష్మీరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడురోజులు సరస్వతిరూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని, ఆక్రమంలో ఈ నవరాత్రులలో ఆ తల్లిని ఆరాధించి తగు ఫలితాలు పొందవచ్చునని పెద్దలు చెప్తుంటారు. ఈ రోజు దుర్గసహస్రనామ పారాయణము, 'దుం' అను బీజాక్షరముతో కలిపి దుర్గాదేవిని పూజిస్తారు. 'ఈదుర్గాష్టమి మంగళవారంతో కలిసిన మరింత శ్రేష్టము' అని అంటారు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|