|
|
Articles: My Thoughts | పత్రికల పుట్టుక-పరిణామం - Site Administrator
| |
(నర్సయ్య, కిరణ్ కుమార్)
ఆధునిక కాలంలో సమాజ చైతన్యానికి, ప్రజా జాగృతికి పత్రికలు, సమాచార రంగాలు గణనీయమైన పాత్రను పోషిస్తున్నాయి. కాని ప్రాచీన కాలంలో ఈ పత్రికలు లేవు. విద్యుచ్ఛక్తిని కనుగొనటం, అచ్చుయంత్ర తయారి, తంతి తపాలా సౌకర్యాల విస్తృతి వంటివి పత్రికల పుట్టుకకు కారణాలయ్యాయి. భారతదేశంలో వార్తా పత్రికల ప్రచురణకు శ్రీకారం చుట్టిన మొదటి భారతీయుడు రాజారామ్ మోహన్ రాయ్. అందువల్లనే ఇతనిని సామాజిక వికాసోద్ధారకుడు అని గౌరవిస్తారు. రాయ్ కంటే ముందు ఇంగ్లీషు క్రైస్తవ మిషనరీలు మనదేశంలోని మత, సాంఘిక రంగాలలోని లోటుపాట్లను ఎత్తిచూపడానికి క్రైస్తవ మత గొప్పతనాన్ని తెలియచెప్పడానికి పత్రికలను ఏర్పాటు చేసినారు. అయితే వారి ప్రయత్నాలను నిరసించడానికి రాయ్ సంవాద కౌముది అనే బెంగాలి పత్రికను, మిరాత్ - ఉల్ అక్బర్ అనే పారశీక పత్రికను ఏర్పాటు చేశారు. అవే భారతదేశంలో మొట్టమొదటి పత్రికలు.
తెలుగునాట 1835లో మొదటి పత్రిక బళ్ళారిలో ప్రారంభమై క్రైస్తవ మిషనరీల ఆధ్వర్యంలో నడిచింది. ఆ తర్వాత 1840 సంవత్సరంలో 'సత్యదూత' స్థాపితమై పెళ్ళిళ్ళలో జరిగే దుబారా ఖర్చులను గూర్చి, భోగం మేళాల వల్ల కలిగే అనర్ధాలను గూర్చి ప్రచురించింది. గిడిగు రామ్మూర్తి పంతులు ప్రారంభించిన 'గద్యచింతామణి' ప్రసిద్ధి పొందింది. ఈ పత్రిక తర్వాత ప్రారంభమైన 'వర్తమాన తరంగిణి' పత్రిక సుమారు 8 సవంత్సరాల కాలం వారపత్రికగా కొనసాగింది. 'దిన వర్తమాని' అనే వార పత్రిక క్రైస్తవుల యాజమాన్యంలో ప్రచురించేది. 'దివ్య వర్తమాని' పత్రిక మద్రాసులో అచ్చువేయబడేది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశంలోని బళ్ళారి నుంచి 'శ్రీయక్షిణి' అనే 1863 సంవత్సరం నుంచి 1867 వరకు నడుపబడేది. క్రిందటి శతాబ్ది ఉత్తరార్థంలోని సుజనరంజని, తత్వబోధిని, వివేకవర్ధిని, పురుషార్ధప్రదాయిని వంటివి ఆనాటి సమాజ సాంఘిక సాంస్కృతిక రంగాలను, ప్రజల జీవన సరళిని వివరిస్తున్నాయి. 1853వ సంవత్సరంలో చిన్నయసూరి 'వాణిదర్పణ ముద్రాక్షరశాల' అనే అచ్చు యంత్రాన్ని స్థాపించుకొన్నాడు. సిపి బ్రౌన్ ఈ కాలంలో సుమారు 8 ముద్రాక్షరశాలలు ఉన్నాయని రాశాడు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|