|
|
Articles: My Thoughts | 'పింగళి'కి ప్రాణం పోద్దాం!! - Site Administrator
| |
'పింగళి'....ఒక తరం క్రితం ఆంధ్రదేశంలో ఈ పేరు తెలియని వారు ఉండరు. తెలుగు చలన చిత్ర చరిత్రలో 'క్లాసిక్స్'గా ప్రసిద్ధి చెందిన మాయాబజార్, పాతాళభైరవి, జగదేకవీరుని కథ చిత్రాల రచయతగా పింగళి పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. పింగళిగా తెలుగువారికి సుపరిచుతులైన పింగళి నాగేంద్రరావు సినిమా రచయితగా మాత్రమే నిన్నటి తరానికి తెలుసు. ఈ తరానికి అది కూడా తెలియకపోవచ్చు. ఆయన కలం నుంచి వచ్చిన 'ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే' పాట ఆ మధ్య ఖుషీ సినిమాలో మరోసారి సూపర్ హిట్ అయింది. అదే పేరుతో వచ్చిన వెంకటేష్ సినిమా కూడా హిట్టే.
నాక్కూడా... పింగళి సిన్మా రచయితగానే తెల్సు. మాయాబజార్, పాతాళభైరవి, జగదేకవీరుని కథలాంటి సిన్మాల వెనుక ఉన్న ఆయన కలంబలం నన్ను ఆకట్టుకుంది. ముఖ్యంగా... కౌరవులు ఉత్తరాది వారు కదా అనే అనుమానం రాకుండా... 'ఆంధ్రమాత గోంగూర పచ్చడి లేకుండా దుర్యోధనుడు ముద్దెత్తడు' అని మాయాబజార్ లో ఢంకా బజాయించి చెప్పడం పింగళికి తప్ప మరెవరికీ సాధ్యం కాకపోవచ్చు. ఇక జగదేకవీరుని కథలో 'గెలివి', 'హే రాజన్', 'శృంగారవీరన్' అంటూ కొత్త మంత్రి సిఎస్ఆర్ చేసే అల్లరి ఇప్పటికీ గిలిగింతలు పెడుతుంది.
తెలుగు వారు క్లాసిక్కులు అని గర్వంగా చెప్పుకునే అత్యధిక సిన్మాల వెనుక పింగళి నాగేంద్రరావు హస్తం ఉంది. అందుకే ఆయన గురించి తెలుసుకోవాలని అనిపించింది. ఓ సారి వృత్తిపరమైన పని ఉండి ప్రముఖ రచయిత డి.వి.నరసరాజుగారిని కలిశాను. పింగళి గురించి ఆయనను అడిగాను. ఆయన అనేక వివరాలు చెప్పారు. నాగేంద్రరావు గారు రాసిన నాటకాల గురించి... ఆయన జీవితం గురించి చాలానే చెప్పారు. అప్పుడు ఆయన నాటకాలు సేకరించి ప్రచురిస్తే కొంతైనా ఆ మహా రచయిత రుణం తీర్చుకున్నట్టవుతుందని పని మొదలుపెట్టాను.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|