|
|
Articles: My Thoughts | సత్యాన్వేషి సర్వేపల్లి - Site Administrator
| |
(డా. విజయబక్ష్)
ఉపాధ్యాయుల పట్ల తమకున్న భక్తిగౌరవాలను సన్మానాలు, సత్కారాల ద్వారా విద్యార్థులు ప్రకటించుకోవడం ఆనవాయితీ. ప్రభుత్వం కూడా తన వంతు 'విధి'గా 'ఉత్తమ ఉపాధ్యాయుల'ను గౌరవించటం, సత్కరించటమూ సాధారణంగా వస్తున్నదే. అయితే ఇవన్నీ మొక్కుబడిగా సాగిపోతున్నాయన్న వ్యాఖ్యలు ఇటీవలి కాలంలో వినిపిస్తున్నాయి. ప్రతి ఏడాది గొప్పవారి జయంతులు, వర్ధంతులు క్రమం తప్పకుండా చేయటమే తప్ప ఆ మహాపురుషుల జీవన విధానం, వారి జీవితాల నుండి మనమేం గ్రహిస్తున్నాం, గ్రహించగలం అనే స్పృహ ఇటు పెద్దవారిలోను అటు చిన్నవారిలోనూ కూడా లేకుండా పోతున్నది.
ఒక పెద్ద దేశానికి, ప్రజాస్వామ్య వ్యవస్థ నెలకొన్న అధిక జనాభా గల దేశానికి 'ప్రథమ పౌరుడు' అయిన వ్యక్తి తన జీవితాన్ని ఉపాధ్యాయుడిగా ప్రారంభించాడు. అదీ ఎంతో ఆదర్శవంతమైన, ఉత్తమ ఉపాధ్యాయుడుగా కీర్తించబడి విద్యార్థులకు అత్యంత ప్రేమాస్పదుడుగా మన్ననలందుకొన్నవాడు. ఆయనే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆ గొప్ప మనిషి జన్మదినాన్నే మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకొంటున్నాం. గొప్ప విద్యావేత్తగానే కాదు, గొప్ప తత్వవేత్త, వేదాంతి, రాజనీతిజ్ఞుడిగా కూడా ఆయన ప్రఖ్యాతి పొందాడు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలోను, రాజమండ్రి ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలోను సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యాపకుడిగా పనిచేశారు.
మైసూరు, కలకత్తా విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుడిగా, ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా 1931-36ల్లోను 1939లో బెనారస్ విశ్వవిద్యాలయ వైఎస్ ఛాన్సెలర్ గాను పనిచేశారు. అంతేకాదు 1936లో ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయ ఆహ్వానం మేరకు 'ఈస్ట్రన్ రెలిజియన్స్ అండ్ ఎథిక్స్' చైర్ పర్సన్ గా ఆహ్వానింపబడి ఆక్స్ ఫర్డ్ వెళ్ళారు. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉప కులపతిగా ఉన్న కాలంలో విద్యావిషయకంగా, విశ్వవిద్యాలయ అభివృద్ధిపరంగా ఎన్నో నిర్ణయాలు చేశారు. దక్షిణ భారతదేశంలో టెక్నాలజీ కోర్సును ప్రారంభింపజేశారు. ఆ కోర్సు సిలబస్ రూపొందించే బాధ్యతను ప్రఖ్యాత ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు అప్పగించారు. ఇట్లా ఆంధ్ర విశ్వవిద్యాలయం దక్షిణ భారతంలో టెక్నాలజీ కోర్సును ప్రారంభించిన మొట్టమొదటి విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందింది. గ్రంథాలయం, హాస్టలు, క్లాక్ టవరు నిర్మాణంలో ఆయన కనబరచిన శ్రద్ధ అపారం.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|