|
|
Articles: My Thoughts | అజాగ్రత్తకు మందు - Site Administrator
| |
(ఎ.రామలింగేశ్వరరావు)
ప్రశాంత్ ఎన్ దనాంకర్. ఈ పేరు మనం తరచు వార్తల్లో చూసేది కాదు, వినేది కాదు. కాని ఈ వ్యక్తి దాదాపు 16 సంవత్సరాల పాటు మన రాష్ట్రంలోని ప్రఖ్యాతి చెందిన నిమ్స్ వైద్య సంస్థపై పోరాటం చేసి సుప్రీంకోర్టు ద్వారా వైద్యుల అశ్రద్ధకి కోటి రూపాయల నష్టపరిహారం పొందిన వ్యక్తి.
ప్రశాంత్ కి తరచూ జ్వరం వస్తున్నందున, స్థానిక డాక్టర్లు ద్వారా నయంకాకపోతే నిమ్స్ లో ఛాతీ నిపుణుడ్ని కలిశాడు. స్కానింగులు, బయాప్సీల తర్వాత ఛాతీకి ఎడమవైపున కణితి ఉందని తేల్చి, 23.10.1990న ఆపరేషన్ చేశారు. స్పృహలోకి వచ్చాక తెలిసింది, తన శరీరంలో క్రింది సగభాగం చచ్చుపడిపోయిందని. అపుడతను బి.టెక్ రెండవ సంత్సరం చదువుతున్నాడు. ఫిజియోథెరపీతో నయమవుతుందిలే అని సర్దిచెప్పి వీల్ చైర్లో ఇంటికి పంపారు. తమ కొడుక్కి వైద్యం ద్వారా నయం చెయ్యమని తల్లితండ్రులు పెట్టుకున్న మొరను వైద్యులు ఆలకించలేదు.
కాని పట్టుదలతో ప్రశాంత్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తమ్ముడు చదువుమాని అన్నకు సాయంగా ఉన్నాడు. తల్లి తన కిష్టమైన టీచర్ ఉద్యోగం మానేసింది. తండ్రి న్యాయపోరాటానికి సహాయపడ్డాడు. జాతీయ వినియోగదారుల కమిషన్ లో ప్రశాంత్ 4.61 కోట్ల పరిహారం అడుగుతూ 1993లో కేసు దాఖలు చేశాడు. కమిషన్ వైద్యుల అశ్రద్ధను ఒప్పుకుంటూ 15 లక్షల పరిహారం ఇచ్చింది. తీర్పు అన్యాయమని నిమ్స్ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. పరిహారం చాలదని ప్రశాంతూ సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. సుప్రీంకోర్టు ముందు తన కేసు తనే వాదించుకున్నాడు. 14.5.29న సుప్రీంకోర్టు పరిహారాన్ని కోటి రూపాయలకు పెంచుతూ తీర్పు ఇచ్చింది.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|