|
|
Articles: Devotion | పార్థుని కృష్ణ భక్తి - Site Administrator
| |
శిష్యులందరికీ తమ గురువు పట్ల ప్రేమ అయితే ఉంటుంది. కానీ ఆ గురువుని ఎంతగా ఆరాధిస్తున్నాం, మనకున్న నమ్మకం ఏ పాటిది అనేదే ప్రమాణమవుతుంది. ఆచరణకు సాధ్యంకాదని అనిపించినా గురువాజ్ఞను పాటించిన వాళ్లే ఉత్తమ శిష్యులవుతారు. అలా జరిగినప్పుడు గురువులు తమ శిష్యులను తనంత వాళ్లుగా తీర్చిదిద్దుతారు. ఒక దశలో గురుశిష్యులు అభేదులు అవుతారు. అంతటి ఉన్నత స్థితిని శిష్యుడు పొందగలిగితే అంతటా సర్వేశ్వరుడే కనబడతాడు. దీనికొక ఉదాహరణగా శ్రీ రామకృష్ణ పరమహంసగారు తన శిష్యుడికి శ్రీకృష్ణుని పట్ల అర్జునుడు చూపిన గురుభక్తిని ఈ విధంగా వివరించారు.
శ్రీకృష్ణుడు ఒక రోజున అర్జునితో వ్యాహ్వాళికి వెళుతున్నాడు. అలా వెళుతున్న శ్రీకృష్ణుడు ఒక్కసారిగా ఆకాశాన్ని చూసి ఇలా అన్నాడు. 'అర్జునా! అదిగో చూడు. ఎంత అందమైన పావురమో... ఎగురుతూ పోతూ ఉంది!' అన్నాడు. ఆకాశం వైపు చూసిన అర్జునుడు వెంటనే ఇలా అన్నాడు. 'ఆఁ అవును ప్రభూ!' ఎంతటి అందమైన పావురం!' అన్నాడు. కానీ వెంటనే శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు 'లేదు లేదు అర్జునా! అది పావురం కాదు' అన్నాడు. అర్జునుడు కూడా మళ్ళీ అటు వైపు చూసి ఇలా అన్నాడు. ఆఁ! నిజమే ప్రభూ! అది పావురంగా కనిపించడం లేదన్నాడు. ఇలా అర్జునుడికి ఎందుకు అన్పించిందంటే శ్రీకృష్ణుని పట్ల అపారమైన నమ్మకం, భక్తి, శ్రద్ధ ఉండటం వల్లే శ్రీకృష్ణుడు ఏది చెబితే అర్జుడుకి కూడా అలానే కనిపించసాగింది. ఈ భగవత్ శక్తి ప్రతి మనిషిలోనూ స్వల్పంగానో, అధికంగానో ఉంటుంది. శిష్యుడు గురువు పట్ల అంచలల భక్తివిశ్వాసాలు కలిగి ఉన్నప్పుడు అతనికి స్వరం దాసోహమంటాయి. అలాంటి శిష్యుడికి గురువే దిక్సూచి అవుతాడు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|