|
|
Articles: Devotion | సీతాదేవి శాపం - Miss rajeswari rajeswarinedunuri
| |
పితృ వాక్య పరిపాలకుడైన శ్రీ రామచంద్రుడు భార్యా సమేతుడై తమ్ముడు లక్ష్మణుని తో సహా అడవులకేగిన సంగతి జగద్విదితమే. ఐతే అలా కానన భూములలో సంచరించు సమయమున పల్గుణీ నదీ తీరమున ఒక పర్ణశాలలో ఉన్నారు. అప్పుడు రామ లక్షమణులు పితృ శ్రాద్ధము నిర్వహింప వలసిన తిధి వచ్చినది. అందుకు కావలసిన వస్తువులను తీసుకుని రమ్మని చేరువనే ఉన్న ముని పల్లెకు శ్రీరాముడు లక్ష్మణుని పంపెను. లక్ష్మణుడు ఎంతకీ రానందున స్వయముగా తానే బయలుదేరెను. మధ్యాన్న సమయము మించి పోవు చుండెను. సీత ఒంటరిగా పర్ణశాలలో వారి రాకకై ఎదురు చూచుచూ 'అపరాహ్నము మించిన పిదప ఆబ్ధీకము పెట్టుట శాస్త్ర విరుద్ధము కదా! అని తలచి తుదకు తానే ఫల్గుణీ నదిలో స్నాన మాచరించి తడి బట్టలు కట్టుకుని లభించిన వాటితో పిండ ప్రదానము చేసి పితృ దేవతలను తృప్తి నొందించెను. అందులకు సంతసించిన దేవతలు...
'జనక నందినీ మేమిప్పుడు సంతృప్తి నొందినాము. నీవు మిక్కిలి ధన్యు రాలవు' అన్న మాటలు ఆమెకు వినబడినవి. అంతే గాక పితృదేవతలు ప్రీతితో ఆమె వంటకములను, శాక పాకములను పరిగ్రహించుటకై చేతులు జాచి యున్నట్లు కన్నులారా గాంచి ఆశ్చర్య చకితురాలైనది. అప్పుడు ఆమె తన సంసయ నివృత్తికై 'మహనీయులారా! ఎవరు మీరు ఈ వింత ఏమి? అని సవినయముగా ప్రశ్నించినది. అందులకు దశరధుడు' అమ్మా సీతా! నేను నీ మామను దశరధుడను, వీరు నా పితృ పితామహులు. నీ వొనరించిన పిండ ప్రదానము స్వీకరించి మేము సంతుష్టుల మైతిమి. ఇది గయా శ్రాద్ధ ఫలితమైయనది' అని అదృశ్య రూపమున ముదమున బల్కెను.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|