|
|
Articles: Recipes | రాజ్ కచోరి - Site Administrator
| |
కావలసిన పదార్థాలు :
మైదా : అరకిలో
శెనగపిండి : 100 గ్రాములు
పనీర్ : 100 గ్రాములు
క్యారెట్ : రెండు
బంగాళా దుంపలు : మూడు
ఉల్లిపాయలు : రెండు
రాజ్ మా గింజలు : రెండు టీ స్పూన్స్
నిమ్మకాయలు : రెండు
కొత్తిమీర కట్ట : ఒకటి
అల్లం, వెల్లుల్లి : 1 టీ స్పూన్
ఛాట్ మసాలా : 1 టీ స్పూన్
కారం : అర టీస్పూన్
సోంపు : పావు టీ స్పూన్
తినే సోడా : పావు టీ స్పూన్
ఉప్పు : తగినంత
నూనె : తగినంత
తయారు చేసే విధానం : ముందుగా చిన్న కప్పు నూనెను కాస్త వేడి చేసుకోవాలి. ఈ నూనెను జల్లించుకున్న మైదా పిండిలో ఉప్పు, తినే సోడా, నీళ్ళు పోసి పూరీ పిండిలా కలుపుకోవాలి. దీన్ని పని నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత ఈ పిండిని మీడియం సైజు ముద్దలుగా చెసి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నాలుగు టీ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. దీనిలో శెనగపిండి కొంచెం దోరగా వేయించుకోవాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి ముద్ద, సోంపు, కారం కూడా వేసి మరి కొంచెం సేపు వేయించుకోవాలి. మైదా పిండి ముద్దలను తీసుకుని బొటనవేలితో మధ్యలోకి నొక్కి దానిలో శెనగపిండి మసాలాను నింపి, దాన్ని జాగ్రత్తగా మరలా రవుండ్ గా వేళ్ళతో ముసేయాలి. తర్వాత దీన్ని వేళ్ళతోనే కొంచెం వెడల్పుగా ఒత్తుకోవాలి. మరలా బాణిలలో నూనె పోసి వేడి చేశాక స్టవ్ సిమ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒత్తకున్న కచోరీలను వేసి దోరగా వేయించుకోవాలి. రాజ్ మా గింజలను ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. తర్వాత బంగాళా దుంప, క్యారెట్ ముక్కలను, రాజ్ మా గింజలను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని దోరగా వేయించుకోవాలి. దీనిలో ఉండికించి పక్కన పెట్టుకున్న ముక్కలను, తురిమిన పనీర్ ను, ఛాట్ మసాలా వేసి ఐదు నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత దీనిలో కొత్తిమీర, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వేయించుకున్న కచోరీల మధ్యలో పెట్టుకొని గ్రీన్ చట్నీతో తింటే బాగుంటుంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|