|
|
Articles: TP Features | 'మావో' రాజ్యం అబూజ్ మఢ్ - Site Administrator
| |
భద్రతా బలగాలకు దాని భౌగోళిక స్వరూపం గురించి తెలిసింది అత్యల్పం. ఇక మావోయిస్టులు ఏ విధంగా ఎక్కడెక్కడ పొంచి ఉన్నారో కూడా వారికి తెలియదు. గగనతలం నుంచి మ్యాపింగ్ కోసం ప్రయత్నాలు జరిగాయి. కాని అబూజ్ మఢ్ లో చాలా ప్రాంతం అడవులలో ఉన్నది. అందువల్ల దీనిని చేరుకోవడం కష్టం. వాస్తవానికి తమ ప్రస్తుత పథకం 'గ్రీన్ హంట్' తోను, కేంద్రం పర్యవేక్షణలో సమష్టిగా జరపనున్న దాడులతోను మావోయిస్ట్ గెరిల్లాలను అబూజ్ మఢ్ లోకి నెట్టి ఆ ప్రదేశానికే పరిమితం చేయగలిగితే అదృష్టమేనని భద్రతా బలగాలు భావిస్తుంటాయి.
ఛత్తీస్ గఢ్ పోలీస్ శాఖ సీనియర్ అధికారి ఒకరు జగదల్పూర్ లో మాట్లాడుతూ, 'వారు (మావోయిస్టులు) అబూజ్ మఢ్ లోనే ఉండిపోవడం మాకు ఆమోదయోగ్యం కాదు. అది అంతగా జనాభా లేని, వెళ్ళడానికి నిజంగా కష్టమైన ప్రాంతం. ఆ తరహా ప్రాంతానికి మామూలు పోలీస్ రక్షణ లేదా పాలన కూడా అవసరం లేదు. ప్రస్తుతం వారు వివిధ ప్రదేశాలలో ఉంటూ తమ వనరులు పెంచుకోవడానికి, తల దాచుకోవడానికి అబూజ్ మఢ్ స్థావరాన్ని ఉపయోగించుకుంటున్నారు. వారిని అక్కడి నుంచి బయటకు రప్పించడం ఒక సవాల్. అది కష్టమని చెప్పగలను' అని వివరించారు.
అబూజ్ మఢ్ అడవులు మొదలయ్యే ప్రాంతం వరకు మోటారు వాహనాలు వెళ్ళగలవు. మరనార్ అనే కుగ్రామానికి నాలుగు గంటల పాటు నడిచి వెళ్ళవచ్చు. ఆ తరువాత రోడ్డు ఉండదు. అక్కడి నుంచి నడవడం కష్టమైన మార్గమే. ఇంకా లోపలికి వెళితే బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినట్లే. ఒక దేశవాళీ తుపాకిని భుజానికి తగిలించుకుని కనిపించే ఒక యువ గ్రామీణుడు ఇది 'తూర్పు దండకారణ్య ప్రజా ప్రభుత్వం' పరిధిలోనిదని, తాను 'జనతన సర్కార్' (ప్రజా ప్రభుత్వం)కు స్థానిక ముఖ్య ప్రతినిధినని చెప్పుకుంటాడు. 'సిసలైన ప్రజా ఉద్యమానికి స్వాగతం' అని అతను గంభీర స్వరంతో అంటాడు. 'మీరు గుర్తించిన ప్రభుత్వం మెజారిటీని మరచిపోయింది. మెజారిటీ ప్రజలు ఇక్కడే మాతోనే ఉన్నారు' అని అతను పేర్కొన్నాడు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|