|
|
Articles: My Thoughts | విదేశీ వితండ వాదం - Site Administrator
| |
అమెరికా వంటి అగ్రరాజ్యం నాయకత్వంలో అభివృద్ధి చెందిన దేశాల శాస్త్రవేత్తలు ఒక కొత్త వాదన తెర మీదకు తెచ్చారు. గ్రీన్ హౌస్ వాయువులు అధికంగా విడుదలవుతున్నది పారిశ్రామికీకరణ వల్ల కాదని, దానికి అసలు మూలం వ్యవసాయ ఆధారిత దేశాలన్నది వారి వాదన! వ్యవసాయ ఆధారిత దేశాలలో పేడను పిడకలుగా చేసి కాలుస్తారని, దాని వల్ల మీథేన్ వాయువు అధికంగా విడుదలవుతుందని ఎదురు దాడికి దిగారు. కాబట్టి గ్రీన్ హౌస్ గ్యాస్ ల విడుదల తగ్గించాల్సింది భారత్, చైనా వంటి ఆసియా దేశాల వారే అన్నది వారి వాదన.
ఇప్పుడు వారి వాదన మరో అడుగు ముందుకు వెళ్ళింది. మీథేన్ వంటి వాయువుల విడుదలకు కారణం గడ్డి తినే పశువులని నిర్థారించారు. గడ్డిని మేసే పశువులు తేన్పుల ద్వారా మీథేన్ ని వదులుతున్నాయట. అవి గడ్డి ఎంత తింటే అంత ఎక్కువగా తేన్పులు వస్తాయని, ప్రతి తేన్పుకు ఇదిగో ఇంత మీథేన్ విడుదల అవుతుందని, మీ దేశంలో ఇంత పశు సంపద ఉంది కాబట్టి రోజుకు మీథేన్ ఎంత విడుదల అవుతుందో చూడండి, ఆ మీథేన్ పారిశ్రామిక అంశం వల్ల విడుదలయ్యే మీథేన్ కన్నా ఎక్కువగా ఉంటుందని కొత్త గ్రంథం తయారు చేశారు. ఈ కొత్త నిబంధన ప్రకారం పర్యావరణాన్ని పాడుచేస్తున్నది పారిశ్రామిక దేశాలు కాదని, వ్యవసాయ ఆధారిత దేశాలే అని వీరు అంటున్నారు.
ఎంత వింత వాదన! వారు అంతటితో ఆగలేదు. మేము మా విజ్ఞానం ఉపయోగించి మీథేన్ ని తమ తేన్పులతో తక్కువగా విడుదల చేసే కొత్త రకం పశువులను ఉత్పత్తి చేస్తాం. వాటిని మీకు సరఫరా చేస్తాం. పాత సాంప్రదాయ పశువుల స్థానంలో వీటిని పెంచుకోండి అంటూ సలహా ఇస్తున్నారు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|