పశ్చిమ గోదావరిలో వైఎస్ పర్యటన
ఏలూరు: ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. శని, ఆదివారాలు ఆయన జిల్లాలో ఉండి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. గోస్తనీ నది డ్రెయిన్ పై వంతెనకు శంకుస్థాపన చేస్తారు. మంచినీటి పధకాన్ని, ఓ స్కూలు భవనానికి ప్రారంభిస్తారు.పెనుమంట్రంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభిస్తారు. తదుపరి పట్టాలను పంపిణీ చేస్తారు. సాయంత్రం ఏలూరు పాతబస్టాండ్ వద్ద బహిరంగ సభలో ఆయన సాల్గొంటారు.
News Posted: 14 February, 2009
|