కలెక్టరేట్ లో మృతుల ఫొటోలు
ఏలూరు : కేరళలోని కొట్టాయం వద్ద మంగళవారం తెల్లవారు జామున జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన, గాయపడిన వారి ఫొటోలను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రదర్శనకు ఉంచారు. దక్షిణదేశ తీర్థయాత్రలకు పాలకొల్లుకు చెందిన శ్రీనివాస ట్రావెల్స్ లో వెళ్ళిన భక్తులు బస్సు బ్రేక్ లు చెడిపోవడంతో పంబా నది లోయలోకి జారిపడిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం 13 మంది మరణించారు. మృతులను, క్షతగాత్రులను గుర్తు పట్టేందుకు జిల్లా కలెక్టర్ ఈ ఏర్పాటు చేశారు. కాగా, మృతులలో ఐదుగురిని వారి కుటుంబసభ్యులు గుర్తుపట్టారు. తీర్థయాత్రలకు వెళ్ళినవారి కుటుంబ సభ్యులు సమాచారం కోసం ఆతృతగా కలెక్టర్ కార్యాలయానికి వస్తుండడంతో కలెక్టర్ ఈ ఏర్పాటు చేశారు.
News Posted: 18 February, 2009
|