వాడపల్లి వెంకన్న కల్యాణోత్సవాలు
కాకినాడ : ప్రసిద్ధిచెందిన శ్రీజగన్మోహినీ కేసవస్వామి, వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వాముల కల్యాణ మహోత్సవాలు ర్యాలీలో 3వ తేదీనుండీ 10వ తేదీవరకూ వైభవంగా నిర్వహించనున్నారు. ఆత్రేయపురం మండలంలో రానున్న వారం రోజుల్లో ఆధ్యాత్మిక శోభ భక్తకోటికి కనువిందు చేయనున్నాయి. శుక్రవారం రాత్రి 9 గంటలకు స్వామి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సింగం రాధ తెలిపారు. నాలుగున ధ్వజారోహణ, నిత్యబలిహరణ, దర్శనాలు, ఐదున స్వామివారి తీర్థం, రాత్రి ఏడు గంటలకు స్వామి కల్యాణం, రాత్రి పది గంటలకు గౌతమీ గోదావరిలో తెప్పోత్సవం, ఆరున పూజలు భోగాలు, పొన్నమాను వసంతోత్సవం, తొమ్మిదిన స్వామివారి చక్రతీర్థం, పదిన శ్రీపుష్పోత్సవం కార్యక్రమాలతో పాటు ప్రతి రాత్రి వివిధ సాంస్కృతిక కార్యక్రాలు జరుగుతాయి. కల్యాణోత్సవాలను తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు రానున్నడంతో వారికి అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామని ఆలయ మేనేజర్ పి.వి.వి.ఎస్.కామేశ్వరరావు, తహసీల్దార్ డి.ఇమ్మానుయేలు పేర్కొన్నారు.
News Posted: 2 April, 2009
|