బంగారం స్వాధీనం
ఏలూరు : పోలీసులు జరిపిన తనిఖీలలో రెండు కోట్ల నగదును, ఆరు కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం కలపర్రు చెక్ పోస్ట్ వద్ద జరిపన తనిఖీలలో ఆరు కేజీల బంగారం, రెండు కోట్ల నగదను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాల తనిఖీల్లో భాగంగా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా వీటిని తీసుకెళుతుండడంతో పోలీసులు అనుమానంతో డబ్బును, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇవి బ్యాంకలకు సంబంధించినవి వారు చెబుతున్నారు. కాగా విచారణ జరిపి అది నిజమేనని రూఢీ అయితే ఇస్తామని, లేదా కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.
News Posted: 8 April, 2009
|