చిన్నారులపై యాసిడ్ దాడి
ఏలూరు : జిల్లాలో రాజకీయ కక్షలు భగ్గు మంటున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు భౌతిక దాడులకు తెగబడ్డారు. ఓ కాంగ్రెస్ కార్యకర్త, ఇద్దరు చిన్నారులపై యాసిడ్ తో టిడిపి కార్యకర్తలు దాడిచేసిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం రాయచూరులో చోటుచేసుకుంది. క్షతగాత్రుల పరిస్థితి ఆందోళన కరంగా వుంది. చికిత్స కోసం వీరిని ఆస్పత్రికి తరలించారు.
News Posted: 24 April, 2009
|