ప్లాస్టిక్ పేపర్ తో ప్రాణాపాయం
ఏలూరు : విద్యుత్ ఘాతానికి గురై ఓ యువకుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టు మిట్టాడుతున్నాడు. ఓ కాన్వెంట్ కు సంబంధించిన బ్యానర్లు కట్టే పనిలో నిమగ్నమైన రాంబాబు అనే బస్ క్లీనర్ ఆకతాయి తనంగా రైల్వే ఎలక్ట్రిక్ వైరుకు వేలాడుతున్న ప్లాస్టిక్ పేపర్ ను పట్టుకోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. అపస్మారక స్థితిలోకి వెళ్ళిన ఆ యువకుడిని చికిత్స కోసం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆదివారం సాయంత్రం వీచిన ఈదురు గాలులకు పేపరు ఎగిరి వైరుకు చుట్టుకుందని, రెండు రోజులుగా తాము ఆ పేపర్ ను చూస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. ఎస్సై.టి.చంద్రశేఖర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News Posted: 12 May, 2009
|