వంచనకు గురై యువతి మృతి
కాకినాడ : ప్రేమించిన వ్యక్తి పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో మానసిక వేదనకు గురైన ఓ యువతి పక్కనున్న బావిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పేగుతెంచుకుని పుట్టిన కూతురు తనకు దూరం అవుతుందన్న ఆవేదనతో తల్లి మరణాన్ని సైతం ఆహ్వానించింది. ఈ ఘటనలో కూతురు అక్కడికక్కడే మృతి చెందగా, తల్లి మాత్రం రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. స్థానికుల కథనం ప్రకారం మృతురాలు పసుపులేటి లక్ష్మీతులసి, మామిడికుదురుకు చెందిన ఆమె మేనత్త కుమారుడైన కొత్తపల్లి శ్రీనివాస్ ల మధ్య కొంతకాలంగా ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. ప్రేమించి మోసగించిన శ్రీనివాస్ పెళ్ళికి నిరాకరించడంతో ఆవేదనకు గురై ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు చనిపోయే ముందు కూడా శ్రీనివాస్ తో మాట్లాడినట్లు తండ్రి సూర్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ. కె.వి.రత్నం తెలిపారు.
News Posted: 13 May, 2009
|