చలిమిడి తినడంతో అస్వస్థత
రాజమండ్రి : తూర్పు గోదావరి జిల్లాలో కొత్త కోడలు సారెగా తెచ్చిన చలిమిడిని పంచిపెట్టడంతో 60 మందికి పైగా అస్వస్థతకు గురైయ్యారు. ఉప్పల గుప్తం శివారు బడుగుపేటలో ఈ సంఘటన చోటు చేసుకుంది . చలిమిడి తిన్న స్థానికులకు వాంతులు, విరోచనాలు అయ్యి పరిస్థితి విషమించడంతో వీరిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పుడ్ పాయిజన్ కారణంగానే ఈ సంఘటన చోటు చేసుకుందని వైద్యాధికారి చెప్పడంతో 108 ద్వారా అమలాపురం, ముమ్మడివరం, రాజోలు, కాట్రేనికోన, కిమ్స్, మరో నాలుగు ప్రైవేటు ఆసుపత్రులకు 108 ద్వారా వీరిని చికిత్సకోసం తరలించారు.
News Posted: 15 May, 2009
|