నిజామాబాద్ : నిజామాబాద్ లో సాంఘిక సంక్షేమ శాఖ ఏఈ ప్రతాప్ ఇరవై వేల రూపాయలను లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ వారు మాటువేసి పట్టుకున్నారు. బిల్లును మంజూరు చేసేందుకు ఓ కాంట్రాక్టరు నుండి ఏఈ రూ.20 వేలు లంచం డిమాండ్ చేయంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దాంతో కాంట్రాక్టరు నుండి లంచం తీసుకుంటున్న ఏఈ ప్రతాప్ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారలకు దొరికిపోయారు.