విసృతంగా తనిఖీలు
ఏలూరు : ఉగ్రవాదులు రాష్ట్రంలో సంరిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో జిల్లా ఎస్ పి బాలకృష్ణ ఆదేశాల మేరకు పట్టణంలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన ద్వారాకా తిరుమలలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. పట్టణంలో అనుమానస్పద వ్యక్తులు సంచరిస్తున్నా, ఎక్కడైనా ఎక్కువ రోజులు వాహనాలు ఉంచినట్టుగా గమనించినట్టైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. జిల్లా నుంచి వచ్చిన ప్రత్యేక పోలీసులతో పాటు, స్థానిక ఎస్ ఐ తమ సిబ్బందితో ద్వారకకు వచ్చిన ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
News Posted: 6 June, 2009
|