విజిలెన్స్ అధికారుల డేకగన్ను
ఏలూరు : జిల్లాలో జరుగుతున్న గోదావరి పశ్చిమ డెల్టా ఆధునీకరణ పనులపై ప్రత్యేక పరిశీలన జరపాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో జిల్లాలో విజిలెన్స్ అధికారులు డేగకన్నేశారు. విజిలెన్స్ అధికారి కె.గోపినాధ్ ఆధ్వర్యంలో కొన్ని అధికార బృందాలు రంగంలోకి దిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలకాంశాలపై ఈ రకంగా విజిలెన్స్ దర్యాప్తు చర్యలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం గమనించదగ్గ విషయం. జిల్లాలోని పలు రైస్ మిల్లులపై, వ్యవసాయ మార్కెట్ కమిటీలపై, ప్రాజెక్టులపై, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పలు పాఠశాలలపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు.
News Posted: 13 June, 2009
|