నెల్లూరు : నెల్లూరు జిల్లా ముత్తుకూరులో గురువారం వాటర్ ట్యాంకర్ ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందాడు. దాంతో మృతుని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాహనాలను ధ్వంసం చేశారు. దుకాణాలను మూయించి వేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళన కారులను అదుపు చేస్తున్నారు.