నెల్లూరు : స్థానికంగా ఉన్న ఓ స్కూల్లో బాంబు పెట్టినట్లు ఆగంతుకుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో ప్రజల్లో కలకలం సృష్టించింది. నెల్లూరు జిల్లా బాలాజీనగర్ లోని మోడ్రన్ స్కూల్లో బాంబు పెట్టినట్లు సమాచారం అందడంతో ఉలిక్కి పడ్డ యాజమాన్యం పోలీసులకు తెలియజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనతో తమ పిల్లను తీసుకువెళుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు బాంబ్ స్క్వాడ్ బృందం స్కూల్ కి చేరుకుని తనిఖీలు ప్రారంభించారు.