రాజమండ్రి : రాజమండ్రి ఎక్సైజ్ ఎస్సై వెంకటరమణ ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు సోమవారం ఆయన ఇంటిపై దాడులు చేశారు. ఎంవి అప్పారావు రోడ్డులోని గంగోత్రి అపార్ట్ మెంట్ లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో పెద్దమొత్తంలో ఆస్తులు బయటపడినట్లు సమాచారం.