ఏలూరు : ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ టీకే శ్రీదేవికి ఓపెన్ యూనివర్శిటీ ద్వారా డాక్టరేట్ లభించింది. మహారాష్ట్రలోని యశ్వంతరావు చౌహాన్ ఓపెన్ యూనివర్శిటీ శ్రీదేవికి డాక్టరేట్ ను ఇస్తున్నట్లు సమాచారం పంపించింది. గ్రామీణ ప్రాంతాల్లో వాటర్ షెడ్ పథకాన్ని అమలు చేసే కార్యక్రమాల్లో ఎన్ని బృందాలు పాల్గొంటే ఎలాంటి ఫలితాలు సాధించవచ్చనే అంశంపై శ్రీదేవి పరిశోధన చేశారు. ఆమె సమర్పించిన పరిశోధనా వ్యాసానికి డాక్టరేట్ లభించింది. నాలుగు సంవత్సరాల క్రితం ఇక్రిశాట్ లో పనిచేస్తున్న కాలంలో శ్రీదేవి పిహెచ్ డీ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.