లారీ, ఆర్టీసీ బస్సు ఢీ
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లాలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రయాణీకులు మృతి చెందగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. జంగారెడ్డి గూడెం మండలం వేగవరం వద్ద ఆర్టీసీ బస్సు లారీను ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. గాయపడిన క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.
News Posted: 2 July, 2009
|