కరీంనగర్ : పోలీసుల కస్టడీలో ఉన్న నలుగురు దొంగలు ఆత్మహత్య చేసుకునేందుకు పాల్పడ్డారు. కరీంనగర్ జిల్లా చందుర్తి మండలం రుద్రంగి గ్రామంలో ఇటీవల జరిగిన ఓ చోరీ కేసులో వీరిని నిందితులుగా అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్న వీరిని పోలీసులు విచారిస్తున్నారు. గత అర్ధరాత్రి పోలీసు స్టేషన్ లో ఉన్న నలుగురు దొంగలు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పూనుకున్నారు. దొంగల పరిస్థితి గమనించిన పోలీసులు మేములవాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. కాగా వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.