రాజమండ్రి : పశ్చిమగోదావరి జిల్లాలో ఓ స్కూల్ బస్ బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మంది విద్యార్ధులు గాయపడ్డారు. ఉంగటూరు మండలం కొప్పాక వద్ద బస్ అదుపు తప్పి పక్కనే ఉన్న పంటకాల్వలోకి దూసుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. పంటకాల్వలోకి దూసుకుపోయిన బస్స్ ను బ్రిలియంట్ జూనియర్ కళాశలకు చెందిన బస్స్ గా గుర్తించారు. ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులను సమీప ఆస్పత్రికి తరలించారు.