`గిఫ్ట్ గా మొక్కలివ్వండి'
కాకినాడ : పర్యావరణ పరిరక్షణకు మొక్కలు పెంపకం చాలా అవసరమనీ, జిల్లాలో ఎక్కడా లేని విధంగా మొక్కలను బహుమతిగా ఇచ్చే సంప్రదాయాన్ని రోటరీ క్లబ్ చేపట్టడం అభినందనీయమనీ కేసరి శ్రీనివాసరావు అన్నారు. ఈ విధానాన్ని అందరూ ఆచరిస్తే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ సమావేశం శుక్రవారం రాత్రి వి ఆనంద్ అధ్యక్షత జరిగింది. ఈ కార్యక్రమంలోముఖ్య అతిధిగా పాల్గొన్న కేసరి శ్రీనివాసరావుకు రోటరీ ప్లాంటేషన్ చైర్మన్ నల్లమిల్లి మాచిరెడ్డి గులాబీ మొక్కను కానుగా అందేజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న కేసరి శ్రీనివాసరావు పై విధంగా పేర్కొన్నారు. రోటరీతో పాటు వివిధసేవా సంస్థల భాగస్వామ్యంతో కాకినాడోలో గ్రీన్ కోర్ కార్యక్రమాలను విజయవంతం చేయదలిచామని గ్రీన్ కోర్ జిల్లా అధికారి కె సత్యనారాయణ అన్నారు. కార్యదర్శి కె బుచ్చిరెడ్డి క్లబ్ చేపడుతున్న సేవాకార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా గ్రీన్ కోర్ జిల్లా అధికారి మాట్లాడుతూ మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేయడం ద్వారా నాటిన మొక్కల రక్షణ బాధ్యత చేపట్టేందుకు వీలు కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ వాటర్ ప్రాజెక్టు చైర్మన్ చెలికాని సూర్యారావు, రోటరీ ఆశ్రమ చైర్మన్ ఎస్ చిరంజీవరెడ్డి, బ్లడ్ బ్యాంక్ చైర్మన్ జికె శ్రీనివాసరావు, శేషగిరిలు పాల్గొన్నారు.
News Posted: 18 July, 2009
|