శాకాంబరిగా నూకాలమ్మ
ఏలూరు : స్థానిక కొత్త పేటలో కొలువైన అమ్మగలన్న అమ్మ నూకాలమ్మ శాకాంబరి దేవిగా భక్తులకు కన్నుల పండువుగా దర్శనమిచ్చారు. ఆషాడ మాసం చివరి ఆదివారం సందర్భంగా నూకాలమ్మను శాకాంబరిగా అలంకరించి విశేష పూజలు చేశారు. ఆలయ అర్చకులు పాటిబండ్ల రమణకుమార్ ఆధ్వర్యంలో అమ్మవారిని రకరకాల కూరగాయలతో మనోహరంగా అలంకరించారు. గుమ్మడి కాయతో చేసిన గణేష్, పైనాపిల్స్ తో డైనోసార్, సొరకాయతో చేసిన పక్షులు విశేషంగా ఆకట్టుకున్నాయి. అమ్మవారికి భక్తి, శ్రద్ధలతో మహానైవేద్యాలను సమర్పించారు. కార్యనిర్వహణాధికారి పి.ఎస్.వి.ఎస్.కుమార్, తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్ జిల్లా సలహా మండలి అధ్యక్షుడు వాడపల్లి సత్యనారాయణరాజు, గుండాల శివకుమార్, భాజపా జిల్లా కార్యదర్శి కోలా భాస్కర రావు, పెరుమాళ్ళ పోతురాజు తదితరులు పాల్గొన్నారు.
News Posted: 20 July, 2009
|