ఈఈ నివాసంపై ఏసీబీ దాడి
కాకినాడ : కాకినాడ పోర్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గోపీనాధ్ ఇంటిపై బుధవారం ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు ఉన్నాయంటూ ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు ఈ దాడులు చేశారు. వైజాగ్, నెల్లూరులోని ఆయన నివాసాలపై ఏకకాలంలో ఈ దాడులు జరిగాయి. వారి దాడుల్లో 60 లక్షల రూపాయలకు పైగా లెక్కలేనన్ని ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
News Posted: 22 July, 2009
|