`పిల్లల చదువు బాధ్యత తల్లిదండ్రుదే'
నెల్లూరు : గ్రామీణ ప్రాంతాల్లోని బాలబాలికలకు చదువుపై ఆసక్తి కలిగే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సాహాన్ని ఇవ్వాలని కలెక్టర్ కె రాంగోపాల్ సూచించారు. దత్తులూరు జిడ్పీ ఉన్నత పాఠశాలలో సీడ్ అనే స్వచ్చంద సేవాసంస్థ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో తొమ్మిది వేల మంది బాలబాలికలు బడికి దూరంగా ఉన్నారన్నారు. వీరి బంగారు భవిష్యత్తుకోసం తల్లిదండ్రులు తమ పిల్లలు చదువు వైపు మొగ్గుచూపేవిధంగా చూడాలన్నారు. ఇదే పాఠశాలలో చదువుకున్న ఏఐఎస్ అధికారి రామిరెడ్డి చంద్రమౌళీశ్వరరెడ్డి సీడ్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి గ్రామీణుల్లో విద్యాభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమని అన్నారు.