కల్తిసారాకు ఒకరు బలి
నిజామాబాద్ : జిల్లాలో కల్తీసారా తాగి ఓ వ్యక్తి శుక్రవారం మరణించాడు. దోమకొండ మండలంలో కల్తీసారా తాగి ఒకరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ముత్యం పేటలో జరిగిన ఈ ఘటనకు నిరసనగా మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. సారా తయారి దారులు, అమ్మకం దారులను కఠినంగా శిక్షించి మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాలో సారా అమ్మకాలును నిరోధించాలని కూడా వారు కోరుకుంటున్నారు.
News Posted: 31 July, 2009
|