తల్లీకూతుళ్ళ ఆత్మహత్యాయత్నం
రాజమండ్రి : కుటుంబ కలహాల కారణంగా ఓ కుటుంబ సభ్యులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తూర్పు గోదావరి జిల్లా తునిలో తల్లి, ఇద్దరు కూతుళ్ళు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన చోటు చేసుకుంది. దీనిని గమినించిన స్థానికులు వాళ్ళను ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గతకొంత కాలంగా కుటుంబంలో చెలరేగుతున్న కలహాలతో మనస్థాపానికి గురైన వీరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు.
News Posted: 6 August, 2009
|