ఉద్యోగులకు వరుస సెలవులు
కాకినాడ : వరుసగా మూడు రోజులు పబ్లిక్ సెలవులు రావడంతో తమ వారితో ఉల్లాసంగా గడిపేందుకు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు మంచి అవకాశం చిక్కింది. వరుస సెలవులు 14 గోకులాష్టమి, 15 స్వాతంత్య్ర దినోత్సవం, 16 ఆదివారం వచ్చాయి. ఈ మూడు రోజులూ రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయితే 15 స్వాతంత్య్ర దినోత్సవానికి ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా హాజరు కావాలనే నిబంధన ఉంది. దానిని కాదనుకున్న వాళ్లు ఎంచక్కా మూడు రోజులు సెలవు అనుభవించవచ్చు. దూర ప్రాంతాల్లో ఉన్నతమ వారిని కలవడానికి బస్సు, రైళ్ళ రిజర్వేషన్లకు పరుగులు తీస్తున్నారు. దీంతో బస్టాండు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసి పోతున్నాయి. వీరి కోసం రైల్వే, ఆర్టీసీ శాఖలు ప్రత్యేక రైళ్లు, బస్సులను సైతం ఆ మూడు రోజులూ నడుపుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
News Posted: 13 August, 2009
|