కడప : దేశవ్యాప్తంగా స్వైన్ ఫ్లూ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. తాజాగా కడపలో తొలిస్వైన్ ఫ్లూ కేసు నమోదు అయింది. మలేషియా నుంచి వచ్చిన వ్యక్తికి స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు అనుమానం రావడంతో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. పరీక్షించిన డాక్టర్లు ఇతనినకి స్వైన్ ఫ్లూ వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. దాంతో బాధితుడిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.